పాముకాటుతో విద్యార్థి మృతి

10 Mar, 2016 11:24 IST|Sakshi

పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారిని పాము కాటు వేసిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని భాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న అనిల్(5) అనే విద్యార్థి పాఠశాల ఆవరణలో ఆడుకుంటుండగా.. పాము కాటు వేసింది. ఇది గుర్తించిన ఉపాధ్యాయులు విద్యార్థిని హుటాహుటిన జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అయితే..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. అనిల్ మృతి చెందాడు.

 

మరిన్ని వార్తలు