అదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఉద్రిక్తత

4 Feb, 2016 09:44 IST|Sakshi

స్థానికంగా ఉన్న మున్సిపల్ కోర్టును ఎచ్చోడకు తరలించాలనుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాని కోరుతూ అదిలాబాద్ జిల్లా బోథ్ వాసులు రోడ్డెక్కారు. మున్సిపల్ కోర్టును తరలించేందుకు న్యాయమూర్తి చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ రోజు బోథ్ బంద్‌కు పిలుపు నిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసులను మొహరించారు.

 

మరిన్ని వార్తలు