మంటలతో రోడ్డుపైకి దూసుకొచ్చిన మహిళ

13 Apr, 2016 19:20 IST|Sakshi

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. అనంతరం మంటల వేడికి తట్టుకోలేక రోడ్డుపైకి పరుగులు తీసింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోలేపల్లి అఖిల(26) ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకొని రోడ్డు పైకి పరుగులు తీసింది. ఇది గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఉస్మానియ ఆస్పత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు