బైక్‌పై నుంచి జారి పడి యువకుడు మృతి

21 Nov, 2015 11:41 IST|Sakshi

ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. చింతపల్లి గ్రామానికి చెందిన కె.తిరుపతి (25) మిత్రునితో కలసి బైక్‌పై వెళుతుండగా... ఒక కుక్క అడ్డురావడంతో సడెన్ బ్రేక్ వేశారు. బైక్‌పై వెనుక కూర్చున్న తిరుపతి కిందపడిపోగా తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.



 

మరిన్ని వార్తలు