రంగారెడ్డి జిల్లా తాండూర్ మండలం జినుగుర్తి గ్రామంలో గురువారం ఉదయం ముగ్గురు సజీవ దహనమయ్యారు. గ్రామానికి చెందిన ఒక యువకుడు తన చెల్లి, తల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం తను కూడా నిప్పంటించుకున్నాడు. కాలిన గాయాలతో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. కుటుంబకలహాలే ఈ ఘోరానికి కారణమని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.