'వారు చెప్పేదానికి తలా తోక లేదు'

19 Aug, 2016 12:47 IST|Sakshi
'వారు చెప్పేదానికి తలా తోక లేదు'

న్యూఢిల్లీ: ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రజెంటేషన్ కు తలా తోక లేదని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇంజినీర్లు, నిపుణులే ఆ ప్రజంటేషన్ ను తప్పుబడుతున్నారని చెప్పారు. అధికారం శాశ్వతంగా దూరమవుతుందేమోనన్న భయంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చామని చెప్పడం హాస్యాస్పదం అని కేటీఆర్ అన్నారు. ఇక సుప్రీంకోర్టు ఇటీవల స్పీకర్, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటిసులపై కేటీఆర్ స్పందిస్తూ ఫిరాయింపుల చట్టం తనపని తాను చేసుకుపోతుందని అన్నారు. వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ దూసుకుపోతుందని చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శక పద్ధతులను పాటిస్తున్నామని చెప్పారు. 

మరిన్ని వార్తలు