లక్షణంగా దొరికిపోయారు

31 Jul, 2015 21:28 IST|Sakshi

నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో డ్రిప్ వైర్లు దొంగిలించిన వ్యక్తులు పోలీసులకు దొరికిపోయారు. శుక్రవారం వారు దొంగలించిన వైర్లను అమ్మేందుకు యత్నించి నర్సంపేటలో పోలీసులకు చిక్కారు. వారంతా నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రానికి చెందిన వారిగా పోలీసుల విచారణలో తేలింది. వైర్ల విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నకిరేకల్లుకు చెందిన రావుల రాజేష్, సారంగి శ్రీను, బాలరాజు, యాదగిరిలు కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు