ఇదే తొలిసారి 

12 Jan, 2018 01:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజధానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించేలా ఒకే వేదికపై 1,000 రకాల స్వీట్లను ప్రదర్శించటం ప్రపంచంలోనే తొలిసారని పర్యాటక, సాంస్కృతిక మంత్రి అజ్మీరా చందూలాల్‌ తెలిపారు. శనివారం నుంచి సోమవారం వరకు మూడ్రోజులపాటు సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే ఈ ఫెస్టివల్‌లో స్వీట్ల అమ్మకాల కోసం కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు.

గురువారం సచివాలయంలో మంత్రి చందూలాల్, పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశం కలసి ఇంటర్నేషనల్‌ కైట్, స్వీట్‌ ఫెస్టివల్‌ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు