చెరువులో మునిగి చిన్నారుల మృతి

26 Apr, 2016 08:34 IST|Sakshi
చెరువులో మునిగి చిన్నారుల మృతి

కాటేదాన్: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లిలోని ఉందాసాగర్ చెరువులో దిగిన ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు మృతి చెందగా, మరొక బాలుడు గల్లంతయ్యాడు.

లక్ష్మీగూడ వాంబే కాలనీకి చెందిన ప్రశాంత్ (11), సోదరులైన చాంద్‌బాషా (11), సమీర్ (7) సోమవారం సాయంత్రం చెరువులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండడం, ఈత రాకపోవడంతో ముగ్గురూ గల్లంతయ్యారు. పోలీసులు ఈతగాళ్లను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. దీంతో సోమవారం రాత్రి చాంద్‌బాషా మృతదేహాన్ని బయటకు తీశారు. మంగళవారం ఉదయం ప్రశాంత్ మృతదేహం లభ్యమైంది. సమీర్ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు