రంగారెడ్డి:
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని యాచారం మండలం చౌదరిపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. లారీ వెనుక ఉన్న గ్జైలో కారు డ్రైవర్ ఇది గమనించకపోవడతో.. కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలవ్వడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.