టిప్పర్ బోల్తా .. ముగ్గురికి గాయాలు

5 Oct, 2015 20:28 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం యమ్నంపేట ఔటర్ రింగ్ రోడ్డు అండర్ బ్రిడ్జి వద్ద సోమవారం సాయంత్రం ఓ టిప్పర్ బోల్తా పడడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఘట్‌కేసర్ నుంచి ఈసీఐఎల్ వైపు వెళుతున్న టిప్పర్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి వెనక ట్రక్ పైకి లేచింది. అది బ్రిడ్జిని తాకడంతో బోల్తాపడింది. టిప్పర్ డ్రైవర్‌తోపాటు అందులో ఉన్న మరో ఇద్దరికి గాయాలు కాగా, వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు