పింఛన్ బెంగతో ముగ్గురు మృతి

22 Nov, 2014 00:24 IST|Sakshi

కరీంనగర్: పింఛన్ బెంగతో శుక్రవారం ముగ్గురు చనిపోయారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన వొడ్నాల కౌసల్య (63)కు పింఛన్ నిలిచిపోయింది. రేషన్ సరుకులూ రాకపోవడంతో గుండెపోటుకు గురైంది. సైదాపూర్ మండలం గుండ్లపల్లికి చెందిన బీర్‌మహ్మద్(70) పింఛన్ జాబితాలో పేరు లేదన్న మనస్తాపంతో మృతి చెందాడు. గంభీరావుపేటకు చెందిన చంద్రవ్వ(70) పింఛన్ రాదేమోనన్న బెంగతో గుండెపోటుకు గురైంది.
 

మరిన్ని వార్తలు