విషాదం : ఒక్కసారిగా టైరు పేలడంతో..

15 Jul, 2018 16:48 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని బాధితుల బంధువులు తెలిపారు. ఈ ప్రమాదం జిల్లాలోని కోదాడ మండలం కోమరబండ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. బంధువులంతా పని చూసుకుని టాటా ఏస్‌ ఆటోలో తిరిగి సొంతూరికి బయలుదేరారు. అంతలోనే వారిని మృత్యువు కబళించింది. వేగంగా ప్రయాణిస్తున్న ఆటో టైరు ఒక్కసారిగా పేలడంతో ఆదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో దాదాపుగా 25మంది ఉన్నట్లు తెలుస్తోంది. 

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. సంఘటన స్థలంలో బంధువుల రోదనలు వర్ణనాతీతం. మృతులంతా సమీప బంధువులు కావడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు