నిమిషం ఆలస్యం... హాల్ లోకి నో ఎంట్రీ

14 May, 2015 11:10 IST|Sakshi

కోదాడ(నల్లగొండ జిల్లా): పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చినందుకు జిల్లాలో ముగ్గురు విద్యార్థులను ఎంసెట్ పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు. ఈ సంఘటన గురువారం నల్లగొండ జిల్లా కోదాడ, చిలుకూరు మండలాల్లో జరిగింది. వివరాలు.. కోదాడలో ఇద్దరు విద్యార్థులు నిమిషం ఆలస్యంగా వచ్చింనందుకు ఎంసెట్ పరీక్ష రాసేందుకు అనుమతించలేదు.

చిలుకూరు మండలంలోని మిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఒక విద్యార్థిని సైతం నిమిషం ఆలస్యంగా వచ్చినందుకు అనుమతించలేదు. దీంతో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు నిరాశగా ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు