పిడుగుపడి వీఆర్‌ఏ మృతి

4 Oct, 2015 18:32 IST|Sakshi

పిడుగుపాటుకు గ్రామ రెవెన్యూ సహాయకుడు(వీఆర్‌ఏ) ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వీఆర్‌ఏ కొలుకుల నర్సింహులు ఇంటి దగ్గర పశువులకు మేత వేస్తుండగా సమీపంలోనే పిడుగు పడింది. దీంతో నర్సింహులతో పాటు ఓ దుక్కిటెద్దు మృతి చెందింది.
 

మరిన్ని వార్తలు