పాతబస్తీలో ప్రశాంతంగా ప్రార్ధనలు

15 Jun, 2018 14:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పాతబస్తీలో ముస్లిం సోదరుల ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను సీపీ అంజనీకుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో శనివారం రంజాన్‌ ప్రార్థనలకు 5 వేల మందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు.

సిటీలోని 600 మసీదుల వద్ద సెక్యూరిటీ పెంచినట్టు తెలిపారు. 50 సమస్యాత్మక మందిరాల వద్ద సీసీ కెమెరాలు, మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టామన్నారు. అదేవిధంగా సిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు