సాక్షి, హైదరాబాద్ : టిప్పర్ ఇళ్లలోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించిన ఘటన రాజేంద్రనగర్లో చోటుచేసుకుంది. రోడ్డుపై టిప్పర్ని పార్క్ చేసి డ్రైవర్ టీ తాగడానికి వెళ్లగా ఉన్నట్లుండి బ్రేక్ ఫెయిల్ కావండంతో రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లలోకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో ఉన్నవారు భయంతో పరుగులు తీసి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.