నేడు ‘చిన్నమ్మ’ పర్యటన

26 Apr, 2014 04:02 IST|Sakshi
నేడు ‘చిన్నమ్మ’ పర్యటన
  •     జిల్లాలో మూడో దశ ప్రచారం
  •      నాలుగు నియోజకవర్గాల పరిధిలో సభలు
  •      స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, నర్సంపేట, జనగామలో ఏర్పాట్లు పూర్తి
  •  వరంగల్, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మరోసారి జిల్లాలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు జిల్లాలో ఆరుచోట్ల ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఈ దఫా నాలుగు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2.00 గంటలకు స్టేషన్‌ఘన్‌పూర్‌లో, 2-40 గంటలకు పరకాలలో, 3-20 గంటలకు నర్సంపేట లో, 5-30 గంటలకు జనగామలో జరిగే సభల్లో పాల్గొంటారు.

    నర్సంపేట సభ అనంతరం సిరిసిల్లలో సభకు హాజరై జనగామలో ఏర్పాటు చేసిన సభకు వస్తారని సమాచారం. తొలి సారి ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్‌ఎస్ ఈ దఫా జిల్లాలో ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది.

    కేసీఆర్ స్వయంగా సభల్లో పాల్గొంటున్నందున గులాబీ శ్రేణులు, అభ్యర్థుల్లో ఉత్సాహం పెరుగుతోంది. నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థులు జనసమీకరణకు సర్వశక్తులొడ్డుతున్నారు. ఎన్నికల ప్రచార సభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు కోరారు.

మరిన్ని వార్తలు