ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మంగళవారం జిల్లాకు రానున్నారు. ఉదయం 9 గంటలకు జడ్చర్లలోని ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ టీ బ్రేక్ తీసుకుని కలెక్టర్ గిరిజాశంకర్తో కాసేపు భేటీ కానున్నారు. 9.20 గంటలకు జడ్చర్ల ఏరియా ఆస్పత్రిని సందర్శిస్తారు. 20 నిమిషాల పాటు అక్కడి పరిసరాలను పరిశీలించి, సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం 9.40 గంటలకు నాగర్కర్నూల్కు బయల్దేరతారు. 10.40 గంటలకు నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రిని సందర్శిస్తారు.
ఉదయం 11గంటలకు డీఎంహెచ్ఓ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు లంచ్ బ్రేక్ తీసుకొని 2.00గంటలకు బిజినేపల్లికి బయల్దేరుతారు. 2.30 గంటలకు అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి మహబూబ్నగర్కు బయల్దేరతారు. 3.40కు మహబూబ్నగర్లోని ఆర్ అండ్బీ అతిథి గృహానికి చేరుకుని, ఆ తర్వాత జిల్లా ప్రధాన ఆస్పత్రిని సందర్శిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు రవీంద్రనగర్లోని పోచమ్మగుడి వద్ద జరగనున్న బోనాల ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. అన ంతరం సాయంత్రం 5 గంటలకు జెడ్పీ మీటింగ్ హాల్లో జిల్లా అధికారులతో సమావేశం కానున్నారు. 6 గంటలకు ప్రెస్మీట్ అనంతరం హైదరాబాద్ బయల్దేరి వెళ్లనున్నారు.