సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గురువారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గత 24 గంటల్లో మాగ్నూరులో అధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భీమదేవరపల్లిలో 8 సెంటీమీటర్లు, లక్సెట్టిపేటలో 7, మక్తల్, సంగారెడ్డిలలో 5, ధర్మపురి, నారాయణఖేడ్, పెద్దేముల్, ధర్పల్లి, హుజూరా బాద్లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.