సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎక్జామినేషన్ (జేఈఈ) మెయిన్ రాత పరీక్ష ఆదివారం జరగనుంది. బీఈ/బీటెక్లో ప్రవేశాల కోసం ఉదయం 9:30 గంటల నుంచి పేపరు–1, బీఆర్క్/బీప్లానింగ్లో ప్రవేశాల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి పేపరు–2 పరీక్షలు జరుగనున్నాయి.
ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు హాజరు కానుండగా, తెలంగాణ నుంచి 74,580 మంది హాజరుకానున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో 115 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.