నేడు ఢిల్లీకి కేటీఆర్

29 Sep, 2016 02:30 IST|Sakshi
నేడు ఢిల్లీకి కేటీఆర్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ సహా ఇతర పురపాలక సంస్థల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరనున్నారు. దానితోపాటు వివిధ పురపాలక సంస్థల్లో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఈ మేరకు గురువారం కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం అక్కడ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో సమావేశమవుతారు.

భారీ వర్షాల వల్ల హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా  రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలకు జరి గిన నష్టాన్ని ఆయనకు వివరిస్తారు. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు విపత్తుల సహాయ నిధి కింద నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు. ఇక హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాల్లో చేపట్టనున్న పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేయనున్నారు.

>
మరిన్ని వార్తలు