చెట్టుపైనుంచి పడి గీత కార్మికుని మృతి

13 Sep, 2015 12:16 IST|Sakshi

వలిగొండ (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా వలిగొండ మండలం రెడ్లేపాక గ్రామానికి చెందిన గీత కార్మికుడు కల్లు కోసం తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారి పడి మృతిచెందాడు. రెడ్లరేపాక గ్రామానికి చెందిన జవ్వగారి మైసయ్య(53) ఆదివారం ఉదయం తాటి చెట్టు ఎక్కాడు. కల్లు తీస్తుండగా పట్టుతప్పి పడిపోయి మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మరిన్ని వార్తలు