-

టొరంటోలో టూరిజం రోడ్ షో

13 Jun, 2015 01:38 IST|Sakshi
టొరంటోలో టూరిజం రోడ్ షో

సాక్షి, హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కెనెడాలోని టొరంటోలో గురువారం రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య పాల్గొన్నారు. టొరంటోకు చెందిన సుమారు 100 మందికి పైగా ప్రముఖ టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు ఈ రోడ్‌షోకు హాజరయ్యారు. ఉత్తర అమెరికా నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు పర్యాటకులను పంపేందుకు ఆపరేటర్లు, ఏజెంట్లు ఆసక్తి చూపారు.

టొరంటోలోని ఇండియన్ కాన్సుల్ జనరల్ అఖిలేశ్ మిశ్రాతో పాటు భారత పర్యాటక శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు