ట్రాక్టర్, బైక్ ఢీ: ముగ్గురు మృతి

19 Nov, 2015 14:13 IST|Sakshi

కరీంనగర్ జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామ సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ముగ్గురు రైతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. బెజ్జంకి మండలం రేగులపల్లి గ్రామానికి చెందిన జెల్ల యాదగిరి, వంగ తిరుపతి, భూపతి రాములు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



 

మరిన్ని వార్తలు