నేడు, రేపు ట్రాఫిక్‌ మళ్లింపులు

9 Nov, 2019 08:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురునానక్‌ జయంతి వేడుకలతో పాటు మిలాదున్నబి ర్యాలీ నేపథ్యంలో నగరంలో శని, ఆదివారాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురునానక్‌ జయంతి వేడుకల్లో భాగంగా సిక్కులు అశోక్‌ బజార్‌లోని గురుద్వారా ర్యాలీగా బయలుదేరి మళ్లీ అక్కడికే చేరుకుంటారు. ఈ నేపథ్యంలో శివాజీ బ్రిడ్జ్, అఫ్జల్‌గంజ్‌ టి జంక్షన్, రంగ్‌ మహల్‌ జంక్షన్, నయాపూల్, శాంతి ఫైర్‌ వర్క్స్‌ మార్గంలో శనివారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 వరకు మళ్లింపులు ఉంటాయి. మిలాదున్నబి ర్యాలీ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పాతబస్తీ సహా కొన్ని చోట్ల ట్రాఫిక్‌ మళ్లిస్తారు. చార్మినార్, శాలిబండ, మోతిగల్లీ, మదీన, డబీర్‌పుర, అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్, చెత్తబజార్‌ ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.   

మరిన్ని వార్తలు