20న ఓట్ల లెక్కింపుపై శిక్షణ: రజత్‌కుమార్‌

19 May, 2019 04:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 23న నిర్వహించనున్న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ ఈ నెల 20న నగరంలోని ఓ హోటల్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపులో ఎదురయ్యే సమస్యలు, వాటికి పరిష్కారాలు, కచ్చితమైన ఫలితాల ప్రకటన తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.   

మరిన్ని వార్తలు