జూపల్లి ఓఎస్డీ వ్యవహారంలో సీఐపై బదిలీ వేటు

20 Jul, 2018 01:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని భూవివాదంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు, ఓఎస్డీతో వివాదాస్పదంగా మాట్లాడిన సీఐ వ్యవహారంపై పోలీస్‌ శాఖ స్పందించింది. ఈ వివాదంతో సంబంధమున్న ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా తాండూర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌రెడ్డిని వీఆర్‌కు పంపిస్తూ గురువారం కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ ప్రమోద్‌కుమార్‌ ఆదేశాలిచ్చారు. ఓ అదనపు ఎస్పీ స్థాయి అధికారికి విచారణ బాధ్యతలను అప్పగించి అంతర్గత విచారణ నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశించినట్టు పోలీస్‌ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు