విద్యార్థులకు రవాణా సదుపాయం 

16 May, 2018 02:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని ఆవాసాలకు చెందిన 20,754 మంది విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా మంగళవారం జీవో జారీ చేశారు. విద్యార్థికి రూ. 1,862 చొప్పున ఆయా విద్యార్థులకు 2018–19 విద్యా సంవత్సరంలో ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా పాఠశాలలు అందుబాటులో లేనందున ఈ మొత్తాన్ని చెల్లించనుంది.  

>
మరిన్ని వార్తలు