పోలీసు అమరవీరులకు నివాళి

10 Apr, 2015 20:39 IST|Sakshi
పోలీసు అమరవీరులకు నివాళి

వరంగల్ : నల్గొండ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఎస్సై సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజు, లింగయ్యతో పాటు హోంగార్డు మహేష్‌ల ఆత్మశాంతి కోసం జీఆర్‌పీ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం రాత్రి నివాళులర్పించారు. స్టేషన్ ప్లాట్ ఫాంలలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. 'జోహార్ పోలీస్ అమరవీరులకు.. మీ త్యాగం మరువలేనిది..'అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐ రవికుమార్ ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి అమరులైన పోలీసులకు ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాజీపేట రైల్వే డీఎస్పీ శ్రీనివాస్‌రావు, జీఆర్‌పీ ఎస్సైలు శ్రీనివాస్, శ్రీనివాస్‌లతో పాటు ఆర్పీఎఫ్ ఎస్సై అనామికా మిశ్రా, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు