ఐపీఎస్‌ల శిక్షణాతరగతులు తాత్కాలికంగా నిలిపివేత

23 Feb, 2015 23:29 IST|Sakshi

హైదరాబాద్ : స్వైన్‌ప్లూ కారణంగా నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న ఐపీఎస్‌లకు శిక్షణా తరగతులను తాత్కాళికంగా వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా శిక్షణలో ఉన్న 40 మంది ఐపీఎస్‌ల నుంచి రక్త నమూనాలను సేకరించారు.

 

ఆ నమూనాలను ల్యాబ్‌లకు పంపించి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే శిక్షణా తరగతులను తాత్కాళికంగా వాయిదా వేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు