టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం : వీరేశం

4 Dec, 2018 10:08 IST|Sakshi
నార్కట్‌పల్లి : నెమ్మాని గ్రామంలో ప్రచారం..

సాక్షి, నకిరేకల్‌ :  నకిరేకల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచా రంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని నకిరేకల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా న కిరేకల్‌ మండలం నెల్లిబండ, నకిరేకల్‌లోని రెహమత్‌నగర్, 5, 12, 13, 14వ వార్డుల్లో సోమవారం ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నెల్లిబండ గ్రామంలో ప్రజలు కోళాటాలు, పూల వర్షంతో స్వాగతం పలికారు.

నకిరేకల్‌లోని 5వ వార్డులో, రెహమత్‌నగర్‌లో వివిధ పార్టీల నుంచి పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పూజర్ల శంభయ్య, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పల్‌రెడ్డి నర్సిం హారెడ్డి, కొండ వెంకన్నగౌడ్, జెట్పీటీసీ పెండెం ధనలక్ష్మీసదానంద,ం నెల్లిబండ సర్పంచ్‌ ముస్కు పాపమ్మపుల్లయ్య, నాయకులు వీర్లపాటి రమేశ్, యానాల లింగా రెడ్డి,  మంగినపల్లిరాజు, కొండ శ్రీను,  సామ శ్రీని వాస్‌రెడ్డి, యానాల శేఖర్‌రెడ్డి, రాచకొండ వెంకన్న, య ల ్లపురెడ్డి సైదారెడ్డి, కదిరె రమేశ్, షబానా, చిట్యాల, ని ర్మల, నర్సింహ, గంగాధర పద్మ, సబితలు ఉన్నారు.  
ఆశీర్వదించి మరోసారి గెలిపించాలి..

నార్కట్‌పల్లి : ప్రజ సేవ చేయడానికి మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం అన్నారు. మండలంలోని నెమ్మాని గ్రామంలో సోమవారం ప్రచారం నిర్వహించి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన పథకాలే మరోసారి తనను గెలిపిస్తాయని అన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ రేగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, గంట్ల నర్సిరెడ్డి, సట్టు సత్తయ్య, గాయం శ్యాంసుందర్‌రెడ్డి, ఎంపీటీసీ ఊయాల అనితవెంకన్న, తదితరులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు