'నిజాం నవాబుకు ధన్యవాదాలు తెలపాలి'

17 Sep, 2014 10:00 IST|Sakshi

హైదరాబాద్ : తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం తెలంగాణ భవన్పై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 రాజుల పాలన నుంచి...ప్రజా పాలన వచ్చిన రోజుని అన్నారు. నిజాం నవాబుకు ధన్యవాదాలు తెలిపాలని నాయిని అన్నారు. సొంత దేశాన్ని వదులుకుని హైదరాబాద్ను నిజాం నవాబు భారతదేశంలో విలీనం చేశారని ఆయన పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు