ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

14 Feb, 2018 15:39 IST|Sakshi
పార్టీలోకి ఆహ్వానిస్తున్న మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి

పెన్‌పహాడ్‌(సూర్యాపేట) : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కార్యకర్తలను కోరారు. మంగళవారం మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామంలోని ఆటో యూనియన్, వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.

ప్రజావ్యతిరేక విధానాలను ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించి కాంగ్రెస్‌ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. 2019సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌గాంధీ సారధ్యంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కొప్పుల వేణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సూదిరెడ్డి సత్యనారాయణరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, మండలి జ్యోతి, పిచ్చయ్య, నారాయణ శ్రీనివాస్‌రెడ్డి, కళింగారెడ్డి, దేవయ్య, నాగయ్య, ఇంద్రయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు