టీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కులేదు

23 Nov, 2018 14:16 IST|Sakshi
ప్రచారంలో మాట్లాడుతున్న శ్రీధర్‌బాబు 

 మాజీ మంత్రి శ్రీధర్‌బాబు

మంథని(రామగిరి) : ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను అమలుచేయకుండా విస్మరించిన టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రామగిరి మండలం లొంకకేసారం, కల్వచర్ల, రత్నాపూర్, గోకుల్‌నగర్, కృష్ణానగర్, సెంటినరీకాలనీల్లో గురువారం ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేతి గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ఆయన కోరారు. కాసారం, కల్వచర్ల, గోకుల్‌నగర్, కృష్ణానగర్, రాజాపూర్‌కు చెందిన పలువురు ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. నాయకులు చొప్పరి సదానందం, గంట వెంకటరమణారెడ్డి, కర్రు నాగయ్య, తొట్ల తిరుపతి యాదవ్, తోట చంద్రయ్య, వనం రాంచెందర్‌రావు, ముస్త్యాల శ్రీనివాస్, మోలుమూరి శ్రీనివాస్, బండారి సదానందం తదితరులు పాల్గొన్నారు. 

ఆదివారంపేటలో గడపగడపకు కాంగ్రెస్‌ 
రామగిరి: మండలంలోని ఆదివారంపేటలో గురువారం కాంగ్రెస్‌ నాయకులు గడపగడపకు కాంగ్రెస్‌ కార్యాక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటా తిరుగుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతి గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు జెడ్పీటీసీ సదానందం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వీరికి సదానందం కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

మరిన్ని వార్తలు