'సీమాంధ్రులు మీ వాళ్లు కాదు.. మా వాళ్లే'

25 Jun, 2015 15:26 IST|Sakshi
'సీమాంధ్రులు మీ వాళ్లు కాదు.. మా వాళ్లే'

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రాల రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న సీమాంధ్రలు తమ వాళ్లేనని టీఆర్ఎస్ నేతలు బిగాల గణేష్, గువ్వల బాలరాజు అన్నారు. గురువారం వారిద్దరూ ఇక్కడ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాల వారు హాయిగా జీవిస్తున్నారని వారు చెప్పారు. తప్పు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు వివాదం నుంచి తప్పించుకునేందుకే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ కేసుల్లో సైతం తప్పించుకున్న చరత్ర చంద్రబాబుదేనని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం పదవికి వెంటనే రాజీనామా చేసి వాయిస్ టెస్టుకు హాజరవ్వాలని వారు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు