మానవత్వాన్ని చాటుకున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

16 Dec, 2018 20:07 IST|Sakshi
ఎమ్మెల్యే క్రాంతికిరణ్

సాక్షి, మెదక్‌: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓ నాయకుడి కుటుంబానికి సాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త కాజా ఇటీవల విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. కాజా మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ విషయం తెలుసుకున్న క్రాంతికిరణ్‌ ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాజా కుంటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని అతని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు