అవినీతికి అడ్డాగా మార్చారు

22 Nov, 2018 13:07 IST|Sakshi

కాంగ్రెస్,టీఆర్‌ఎస్‌ పార్టీలపై బీజేపీ నాయకుల ఆరోపణ

సాక్షి, చౌటుప్పల్‌ : కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నాయకులు మునుగోడును అభివృద్ధి చేయకపోగా అవినీతికి అడ్డాగా మార్చారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు దాసోజు భిక్షమాచారి ఆరోపించారు. మండలంలోని లింగోజిగూడెం గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు దాసోజు భిక్షమాచారి మాట్లాడుతూ విద్యావంతుడైన మునుగోడు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గంగిడి మనోహర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.

నీతివంతమైన పాలన కోసం బీజేపీని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ రమనగోని శంకర్, నాయకులు  పిల్ల బుచ్చయ్య, అయిలయ్య, కొండపురం దుర్గయ్య, బండమీది మల్లేశం, బాతరాజు లింగస్వామి, గణేశ్, ఎర్రగోని సత్యనారాయణ, మల్లేశం, దశరథ, జంగయ్య, పర్నె అశోక్, జంగారెడ్డి, ఎర్ర నర్సింహ, బుచ్చయ్య, పల్లె వెంకట్‌రెడ్డి, పోలేపల్లి భాస్కర్, శేఖర్‌ ఉన్నారు. 


మనోహర్‌రెడ్డి సతీమణి విస్తృత ప్రచారం
మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గంగిడి మనోహర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ బుధవారం ఆయన సతీమణి అనురాధ మండలంలోని పంతంగి, లింగోజిగూడెం, పీపల్‌పహాడ్, మల్కాపురం, నేలపట్ల చౌటుప్పల్‌ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు కార్యకర్తలు లేనందున రోజుకు రూ.200 ఇచ్చి ప్రచారానికి తీసుకెళ్తున్నారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను, చేసిన  అభివృద్ధిని టీఆర్‌ఎస్‌ చేసినట్టుగా చెప్పుకొని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. మునుగోడు సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యావంతుడైన మనోహర్‌రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో తడక సురేఖ, గోశిక నీరజ, దూడల భిక్షం, గుజ్జుల సురేందర్‌రెడ్డి, మన్నె ప్రతాప్‌రెడ్డి, పాలకూర్ల జంగయ్య, ఊడుగు యాదయ్య, రమనగోని శంకర్, డి.భిక్షమాచారి, కంచర్ల గోవర్థన్‌రెడ్డి, వనం ధనుంజయ, పాండు, ఊడుగు వెంకటేశం, కృష్ణ, విజయ్‌కుమార్, భాస్కర్, బుచ్చయ్య, లింగారెడ్డి, బుచ్చిరెడ్డి, పబ్బు వంశీ,  మల్లేశం, శ్రీశైలం, కోటయ్య, రవికాంత్‌రెడ్డి,స్థానిక నాయకులు బీజేపీ కార్యకర్తలు,  తదితరులు ఉన్నారు. 


బీజేపీని గెలిపించాలని ప్రచారం
సంస్థాన్‌ నారాయణపురం : మండలంలోని వావిళ్ళపల్లి పరిధిలోని గిరిజన తండాల్లో బుధవారం బీజేపీ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటువేసి బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొనూరి వీరారెడ్డి, మండల అధ్యక్షుడు దాసోజు వెంకటాచారి, బచ్చనగోని దేవేందర్, భాస్కర్‌ నర్సింహ, వెంకటేష్, వంగరి రఘు, జక్కర్తి భిక్షం, రాములు, రాజు, శ్రీశైలం, బుగ్గ రాములు, కుమారు, రాజు, నగేష్, సైదులు, నర్సింహ, శేఖర్‌ తదితరులున్నారు.  

మరిన్ని వార్తలు