నాగార్జున సాగర్ వద్ద టీఆర్ఎస్ ధర్నా

2 Jul, 2014 14:11 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య అప్పుడే నీటి గోల మొదలైంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ప్రాజెక్టు వద్ద బుధవారం టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు.

కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  కోరింది. నీటిని విడుదల చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు మరోవారం రోజులపాటు నీటిని విడుదల చేయాలని కేంద్ర జల సంఘం అధికారులను ఆదేశించింది. జూలై 8 వరకు రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది.
 

మరిన్ని వార్తలు