రైతుల ఉసురు తీసింది కాంగ్రెస్సే

12 Apr, 2017 01:28 IST|Sakshi
రైతుల ఉసురు తీసింది కాంగ్రెస్సే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని నాలు గున్నర దశాబ్దాలు పాలించిన కాం గ్రెస్‌.. వ్యవసాయ రంగాన్ని పట్టించుకో కుండా రైతుల ఉసురు తీసిందని మండలి లో ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమె త్తారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంగళవా రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లంద కుండా జలవనరులను ధ్వంసం చేసిన పాపపు చరిత్ర కాంగ్రెస్‌ది కాదా అని నిలదీశారు.

టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డికి  టీఆర్‌ఎస్‌ సంస్థాగత అంశాలను విమర్శించే స్థాయి లేదన్నారు.  బీసీల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుత మని అసెంబ్లీలో పొగిడిన బీజేపీ నేత లక్ష్మణ్, బయట అందుకు విరుద్ధంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సామాజిక న్యాయం గురించి మాట్లాటం నేతి బీరకాయ చందంగా ఉందని ఎద్దేవా చేశారు. వరంగల్‌ ప్రజాప్రగతి సభ ద్వారా రెండున్నరేళ్లలో ఏం చేశామో, మిగిలిన రెండున్నరేళ్లలో ఏం చేయబోతు న్నామో వివరిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు