సీఎంను కలిసేందుకు వచ్చిన టీఆర్‌టీ అభ్యర్థుల అరెస్ట్‌

8 Jun, 2019 19:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉపాధ్యాయ నియామకాల జాప్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వచ్చిన టీఆర్‌టీ అభ్యర్థులను పోలీటసులు అరెస్ట్‌ చేశారు. ప్రగతి భవన్‌ వద్దకు వేళ్లేందుకు పోలీసులు అనమతి నిరాకరించారు. అయినప్పటికీ టీఆర్‌టీ అభ్యర్థులు టీఆర్‌టీ ప్రగతి భవన్‌లోకి వేళ్లేందుకు ప్రయత్నించగా అరెస్ట్‌ చేసి గోషామాల్‌ పోలీస్టేషన్‌కు తరలించారు. దీనికి నిరసనగా అభ్యర్థులు అక్కడే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఉదయం నుండి ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో మహిళల పరిస్థితి చాలా ఆందోళనగా మారింది. దీంతో అరెస్ట్‌ చేసిన టీఆర్‌టీ అభ్యర్థులను రిలీజ్‌ చేశారు.

మరిన్ని వార్తలు