టీఎస్‌ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

3 Sep, 2019 17:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేసీఆర్‌ నిర్వాకం వల్లే రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను వాడుకొని బిల్లులు చెల్లించలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్‌ ఆరోపించారు.  ప్రజా ధనాన్ని కేసీఆర్‌ దర్వినియోగం చేస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు తెలంగాణలో కూడా విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని ఎవరూ అధైర్య పడవద్దని ఆయన కోరారు. 

మరిన్ని వార్తలు