చెన్నమనేని పౌరసత్వాన్ని 3 నెలల్లో తేల్చండి

10 Jul, 2019 16:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వాన్ని మూడు నెలల్లోపు తేల్చాలని తెలంగాణ హైకోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించింది. చెన్నమనేని భారత పౌరుడు కాదంటూ శ్రీనివాస్‌ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ అంశంపై తమ అభ్యంతరాలను కేంద్ర హోంశాఖకు మూడు వారాల్లోగా చెప్పాలని చెన్నమనేనికి, పిటిషనర్‌కు సూచింది. 

మరిన్ని వార్తలు