టీచర్‌ పోస్టుల మెయిన్స్‌ జాబితా విడుదల

21 Jun, 2017 22:55 IST|Sakshi

హైదరాబాద్‌: ట్రెయిన్‌డ్‌  గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ), ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ) పోస్టులకు సంబందించిన మెయిన్స్‌ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ బుధవారం ప్రకటించింది. మొత్తం 36,095 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు తెలిపింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపిక 1:15 రేషియోలో జరిగినట్లు చెప్పింది. పూర్తి వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ www.tspsc.gov.in లో చూడవచ్చు.

పోస్టుల వివరాలు..
పీజీటీ-513 పొస్టులు,  టీజీటీ- 2340, పీడీ- 6 పోస్టులకు మెయిన్స్‌ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. వివిధ కేటగిరీల్లో మొత్తం 7330 ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా దివ్యాంగులు‌, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌, బీసీ( మహిళ) ఎజన్సీ(మహిళ)ల కేటగిరిల నుంచి దరఖాస్తులు రాలేదని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు