ఆర్టీసీ కార్మికుని ఆత్మహత్యాయత్నం

26 Nov, 2019 03:53 IST|Sakshi

జేఏసీ నిర్ణయంపై నిరసన  

సాక్షి, భానుపురి (సూర్యాపేట): ఆర్టీసీ జేఏసీ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించడాన్ని నిరసిస్తూ ఓ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రవినాయక్‌ జేఏసీ చేసిన ప్రకటనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. జేఏసీ నిర్ణయం వెలువడగానే డిపోగేటు వద్దకు పెద్ద సంఖ్యలో కార్మికులు వచ్చారు. వారితో పాటు వచ్చిన రవినాయక్‌ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. అక్కడే ఉన్న కార్మికులు, పోలీసులు వెంటనే రవినాయక్‌ వద్దకు చేరుకుని నిప్పంటించుకోకుండా అడ్డుకున్నారు. అతని ఒంటిపై నీళ్లు చల్లి అక్కడినుంచి తరలించారు. జేఏసీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుకున్నారని రవి ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు