లొంగిపోయిన టీవీ9 సీఈఓ రవిప్రకాశ్

17 Aug, 2014 02:39 IST|Sakshi
లొంగిపోయిన టీవీ9 సీఈఓ రవిప్రకాశ్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజాప్రతినిధులను, ముఖ్యమంత్రిని, అసెంబ్లీని కించపరిచే కార్యక్రమాన్ని ప్రసారం చేసిన కేసులో టీవీ9 సీఈఓ రవిప్రకాశ్ హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఎల్‌బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. రూ.25వేల వ్యక్తిగత బాండ్, ఇద్దరు ఉద్యోగుల ష్యూరిటీతోపాటు పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు కండీషన్ బెయిలు మంజూరు చేశారు. తెలంగాణ అసెంబ్లీని కించపరిచేలా టీవీ9 కథనాలు ప్రసారం చేసిందంటూ న్యాయవాది సుంకరి జనార్దన్‌గౌడ్ సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు