గల్లంతైన చిన్నారుల మృతదేహాలు వెలికి తీత...

13 May, 2015 01:42 IST|Sakshi
గల్లంతైన చిన్నారుల మృతదేహాలు వెలికి తీత...

మలేసియాటౌన్‌షిప్: సోమవారం ఈతకు వెళ్లి భారీ క్వారీ గుంతలో గల్లంతైన ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బుధవారం తెల్లవారుజామున కేపీహెచ్‌బీ పోలీసులు వెళికి తీశారు. పీజీఆర్ నగర్‌కు చెందిన నివాస్(12), ఖుషీరామ్(14), మణికంఠ(12)లు సోమవారం మధ్యాహ్నం అదేకాలనీలోని భారీ క్వారీ గుంతలో ఈతకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే.  వీరిలో సోమవారం సాయంత్రం మణికంఠ మృతదేహాన్ని వెళికి తీయగా.. ఖుషీరామ్, నివాస్‌ల ఆచూకీ దొరకలేదు. దీంతో సోమవారం రాత్రి నుంచి రిస్క్యూటీమ్ క్వారీ గుంతలో గాలింపు చేపట్టింది.  

మంగళవారం ఉదయం 5 గంటలకు నివాస్, ఖుషీరామ్‌ల మృతదేహాలను వెళికి తీసి తల్లిదండ్రులకు అప్పగించింది. కాగా ఇళ్ల మధ్య ఉన్న క్వారీ గుంత చుట్టూ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే చిన్నారులు మృత్యువాతపడ్డారని కాల నీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గుంతను పూడ్చి ఆ స్థలంలో పార్కును ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు క్వారీ గుంతను పూడ్చి వేసి ఆ స్థలంలో పార్కును ఏర్పాటు  చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు