గాంధీలో ఇద్దరు కోవిడ్‌ అనుమానితులు 

2 Mar, 2020 04:46 IST|Sakshi

సాక్షి, గాంధీ ఆస్పత్రి: కోవిడ్‌ వైరస్‌ లక్షణాలతో ఇద్దరు అనుమానితులు ఆదివారం గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చేరారు. వారి నుంచి నమూనాలు సేకరించి.. నిర్ధారణ కోసం గాంధీ మెడికల్‌ కాలేజీ మైక్రోబయోలజీ విభాగంలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించామని గాంధీ ఆస్పత్రి నోడల్‌ అధికారి ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన నివేదిక సోమవారం వస్తుందని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఇప్పటివరకు 81 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 79 మందికి కోవిడ్‌ నెగిటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు