డివైడర్‌ను ఢీకొన్న బైక్: ఇద్దరి మృతి

19 Dec, 2015 15:12 IST|Sakshi

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం సమయంలో ఓ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలానికి చెందిన ప్రతాని రాజు (21), పుట్టి ప్రశాంత్ (21) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.

మరిన్ని వార్తలు