మినీ బస్సు, కారు ఢీ : ఇద్దరు మృతి

2 Feb, 2018 07:32 IST|Sakshi

జనగామ : జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడారం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు మినీ బస్సు రఘనాథపల్లిలోని పోలీస్ స్టేషన్‌ సమీపంలో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందారు. మినీ బస్సు బోల్తాపడటంతో అందులోని 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీపీ సుధీర్‌ బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మరిన్ని వార్తలు